: ఏపీకి విభజన హామీలన్నీ అమలవుతాయి: బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలన్నీ అమలవుతాయని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, 2014-15 నుంచి 2018-19 వరకు రెవెన్యూ లోటును భర్తీ చేయాలని 14వ ఆర్థిక సంఘం నిర్ణయించగా, 2014-15 మినహా మిగిలిన సంవత్సరాల ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు కేంద్రం 22 వేల కోట్ల రూపాయలను కేటాయించిందని అన్నారు. ఈ ఏడాదికి సంబంధించిన లోటుపై రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం చర్చలు జరుపుతోందని ఆయన తెలిపారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు కేటాయించిన ప్యాకేజీలో భాగంగా ప్రతి ఏటా జిల్లాకి 50 కోట్ల రూపాయల చొప్పున ఆరేళ్లపాటు ఇవ్వాలని నిర్ణయించిందని ఆయన తెలిపారు.

More Telugu News