: నవంబరులో పాకిస్థాన్ పర్యటనకు వెళుతున్న మోదీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నవంబరులో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనున్నారు. నవంబరులో ఆ దేశంలో జరగనున్న దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్) సమావేశాలకు ప్రధాని హాజరుకానున్నారు. గతంలో మోదీ రష్యా, అఫ్ఘనిస్థాన్ దేశాల్లో పర్యటించిన అనంతరం కాబూల్ లో తిరుగు పయనానికి కొన్ని గంటల ముందు పాక్లో పర్యటించాలని నిర్ణయించుకుని ఆ దేశానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పాకిస్థాన్పై మోదీ ఇటీవల విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్లో మోదీ పర్యటించడం పట్ల ఆసక్తి నెలకొంది.