: జీఎస్టీ బిల్లుకు ఆమోద ముద్ర వేసిన ఏపీ కేబినెట్!

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) బిల్లుకు ఇప్పటికే మెజారిటీ రాష్ట్రాలు మద్దతు పలకగా, తాజాగా నవ్యాంధ్ర కూడా సానుకూలంగా స్పందించింది. నేటి ఉదయం విజయవాడలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్... జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇక ఈ నెల 8 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు.

More Telugu News