: తిరుపతిలో హైడ్రామా... వ్యాపారిని కిడ్నాప్ చేసి కోటి డిమాండ్ చేసిన దుండగులపై ఫలించిన పోలీస్ ట్రాప్

నెల్లూరులో వ్యాపారి కిడ్నాప్ సుఖాంతమైంది. వ్యాపారిని ఎత్తుకెళ్లిన కిడ్నాపర్లు సినీ ఫక్కీలో పోలీసులకు దొరికిపోయారు. అతన్ని విడిచి పెట్టాలంటే తమకు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన వారిపై పోలీస్ ట్రాప్ ఫలించింది. తిరుపతికి వస్తే డబ్బిస్తామని చెప్పించిన పోలీసులు హైడ్రామాను నడిపించారు. వారి మొబైల్ ఫోన్ సిగ్నల్స్ వెళుతున్న మార్గాన్ని పరిశీలిస్తూ, వారిని అనుసరించి వెళ్లి, తిరుపతి పోలీసుల సాయంతో ఆట కట్టించారు. మఫ్టీలో కిడ్నాపర్లను వెంబడిస్తూ వెళ్లి, ఒక్కసారిగా తిరుపతి శివారు ప్రాంతంలో వారిని అరెస్ట్ చేసి వ్యాపారిని విడిపించారు.

More Telugu News