: జగన్ ది మాత్రమే పోరాటం... మిగతా వారిది మోసమే!: రోజా

రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తప్పనిసరిగా తీసుకురావాలని జగన్ ఒక్కరే పోరాడుతున్నారని, మిగతా పార్టీలన్నీ హోదా పేరిట ప్రజలను మోసం చేస్తున్నాయని వైకాపా ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్న ఆమె, మీడియాతో మాట్లాడుతూ, తన నోరు అదుపులో లేదని చెబుతూ, అందుకే సస్పెండ్ చేశామని తెలుగుదేశం చెప్పుకుంటోందని, వాస్తవానికి తనకు ప్యాకేజీలు పుచ్చుకునే అలవాటు లేనందునే సస్పెండ్ చేశారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించిన ఆమె, ప్రజల వాదన వినిపించి సభ నుంచి గెంటివేయబడ్డందుకు తనకు సంతోషంగానే ఉందని అన్నారు. ప్రత్యేక హోదా మాత్రమే కావాలని, తెలుగుదేశం నేతలకు డబ్బుల కట్టలు అందించే ప్యాకేజీలేమీ తమకు వద్దని రోజా తెలిపారు.

More Telugu News