: శ్రీశైలం మాజీ ఈవో విజయసాగర్ బాబు అరెస్టు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, శ్రీశైలం మాజీ ఈవో విజయసాగర్ బాబును అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం విజయవాడ అవినీతి నిరోధక శాఖ కోర్టులో ఆయనను హాజరుపరిచారు. కాగా, విజయసాగర్ బాబు అవినీతి సంపద రూ.60 కోట్లకు పెరిగింది. విజయవాడ, శ్రీశైలం ఆలయం శాఖ బ్యాంకుల్లోని సాగర్ బాబు లాకర్లలో పెద్ద ఎత్తున నగదు, నగలు పట్టుబడిన విషయం తెలిసిందే.

More Telugu News