: ‘ప్యాకేజీ’లోనే ‘హోదా’!... కొత్త వాదన వినిపించిన పురందేశ్వరి!

ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై బీజేపీ కొత్త వాదనను వినిపించింది. విజయవాడలో నేటి ఉదయం ప్రారంభమైన బీజేపీ పదాధికారుల సమావేశానికి హాజరైన ఆ పార్టీ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఈ వాదనను వినిపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కొన్ని ఇబ్బందులున్నాయని పేర్కొన్న ఆమె... సాంకేతికంగా ప్రత్యేక హోదాను ప్రస్తావించలేమని ప్రకటించారు. ప్రత్యేక ప్యాకేజీ పేరిట అందజేయనున్న సాయంలో ప్రత్యేక హోదా ద్వారా లభించే అంశాన్నింటినీ అందులో పొందుపరుస్తామని ఆమె పేర్కొన్నారు.

More Telugu News