: బహు భార్యత్వంపై నిషేధం అక్రమ సంబంధాలకు దారి తీస్తుందట!... ‘సుప్రీం’ ముందు ‘ముస్లిం బోర్డు’ వాదన

బహు భార్యత్వంపై నిషేధం విధిస్తే అది అక్రమ సంబంధాలకు దారితీస్తుందని వాదిస్తోంది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముందు ఆ బోర్డు ఈ వాదనను వినిపించింది. విషయంలోకి వస్తే... ‘తలాక్’ అంటూ మూడు సార్లు పలికితే... ముస్లిం భర్తలు తమ భార్యలకు విడాకులిచ్చేసినట్లే. ఈ దురాచారంపై అదే సామాజిక వర్గానికి చెందిన షయారా భాను అనే మహిళ నేతృత్వంలో పలువురు మహిళలు న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ దురాచారాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలంటూ వారు సుప్రీం గడప తొక్కారు. దీనిపై నిన్న జరిగిన విచారణ సందర్భంగా పర్సనల్ లా బోర్డు వితండ వాదన చేసింది. ముస్లిం పురుషులు స్వీయ నియంత్రణలో మెరుగ్గా రాణిస్తారని, ఈ నేపథ్యంలో ‘ట్రిపుల్ తలాక్’ పెద్ద సమస్యేమీ కాదని ఆ సంస్థ తరఫు న్యాయవాదులు వాదించారు. అంతేకాకుండా ట్రిపుల్ తలాక్ కు చెక్ పెడితే... బహు భార్యత్వానికి ముప్పు వస్తుందని ఆ సంస్థ వితండ వాదన చేసింది. ఇక బహు భార్యత్వాన్ని నిషేధిస్తే... అక్రమ సంబంధాలకు అడ్డే లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

More Telugu News