: తమిళనాడు గవర్నర్ గా మోత్కుపల్లి!... వినాయకచవితి తర్వాత ఉత్తర్వులు!

టీ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కల ఎట్టకేలకు తీరనుంది. చాలాకాలం క్రితమే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నుంచి ప్రతిపాదన అందుకున్న నరేంద్ర మోదీ సర్కారు కాస్తంత ఆలస్యంగా స్పందించింది. తాజాగా తమిళనాడు గవర్నర్ పదవి ఖాళీ అయిన నేపథ్యంలో ఆ పదవిని మోత్కుపల్లికి ఇచ్చేందుకు మోదీ సర్కారు దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వినాయకచవితి తర్వాత ఈ మేరకు కేంద్రం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.

More Telugu News