: బీజేపీ నేత కృష్ణ కిషోర్ పై పోలీసులకు ఫిర్యాదు

కేంద్రంలో నామినేటెడ్ పదవి ఇప్పిస్తానంటూ తనను మోసం చేశారని ఆరోపిస్తూ బీజేపీ నేత కృష్ణ కిషోర్ పై పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధితురాలు ప్రవర్ణ రెడ్డి ఈ మేరకు హైదరాబాద్, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నామినేటెడ్ పదవి ఇప్పిస్తానని చెప్పి తన వద్ద రూ.2.10 కోట్లు తీసుకున్నారని ఆ ఫిర్యాదులో ఆమె ఆరోపించారు.

More Telugu News