: అమలులోకి వచ్చిన రూ. 10 లక్షల రైల్వే బీమా... ప్రీమియం 92 పైసలే!

గత నెలలో భారతీయ రైల్వేలు ప్రకటించిన 92 పైసలకు రూ. 10 లక్షల ప్రమాద బీమా అమల్లోకి వచ్చింది. ఐఆర్సీటీసీ ఆన్ లైన్ బుకింగ్ ద్వారా తీసుకున్న టికెట్లకు 92 పైసల ప్రీమియాన్ని వసూలు చేస్తున్నారు. ఈ కొత్త ప్రమాద బీమాలో భాగంగా, సబర్బన్ రైళ్లు మినహా మిగతా అన్ని రైళ్లలో ప్రయాణాలు జరిపే వారికి బీమా వర్తిస్తుందన్న సంగతి తెలిసిందే. దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే రూ. 10 లక్షలు, అంగవికలురైతే రూ. 7.5 లక్షలు, ఆసుపత్రుల్లో చికిత్సకు రూ. 2 లక్షలు బీమాగా అందేలా ప్రతిపాదనలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం పలికింది. దీనికి అదనంగా మృతదేహాలను ప్రమాదస్థలి నుంచి స్వగ్రామాలకు తరలించేందుకు రూ. 10 వేలు సైతం అందుతుంది. ఉగ్రవాద దాడులు, దోపిడీలు, దొంగతనాలు, రైలు ప్రమాదాలు తదితరాలన్నింటికీ బీమా వర్తిస్తుంది. కాగా, రైలు టికెట్ ను క్యాన్సిల్ చేస్తే మాత్రం ముందు వసూలు చేసిన ప్రీమియం మొత్తాన్ని తిరిగి ఇవ్వరు.

More Telugu News