: కాంగ్రెస్ లో ఉండను... అసలు రాజకీయాలే వద్దు: కొణిజేటి రోశయ్య

తమిళనాడు గవర్నర్ గా పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, ఇకపై విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాల్లోకి మరోసారి ప్రవేశించబోనని స్పష్టం చేశారు. తన జీవితంలో 60 సంవత్సరాల పాటు రాజకీయాలతోనే సరిపోయిందని, ఇకపై కాంగ్రెస్ లోనూ కొనసాగాలని భావించడం లేదని తెలిపారు. ఏపీలో తాను నివాసాన్ని కోరుకోవడం లేదని, కాబట్టి ఏపీ రాజకీయాలు సైతం తనకు వద్దని రోశయ్య చెప్పడం గమనార్హం.

More Telugu News