: కరవు, చంద్రబాబు కవల పిల్లల్లాంటివారు: రాయలసీమ పోరాట సమితి కన్వీనర్

ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడ్డదారులు తొక్కుతున్నారని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విచారణను నిలిపివేయాలని కోరుతూ చంద్రబాబు ఈరోజు హైకోర్టును ఆశ్రయించడంపై ఆయన ఆరోపణలు చేశారు. బాబుకు ధైర్యం ఉంటే ఈ కేసు విచారణను ఎదుర్కోవాలని అన్నారు. కరవు, చంద్రబాబు కవల పిల్లల్లాంటివారని, ఆయన ఎక్కడుంటే అక్కడ కరవు తాండవిస్తుందని నవీన్ కుమార్ రెడ్డి విమర్శించారు.

More Telugu News