: ‘దళిత’ రాగం అందుకున్న పదవి కోల్పోయిన ఢిల్లీ మంత్రి!

అవినీతిని అంతమొందిస్తామంటూ రంగంలోకి దిగిన ఆప్ పార్టీలో అతడో కీలక నేత. ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు అనుకూలంగా వీచిన గాలిలో అతడు కూడా గెలిచాడు. ఆ తర్వాత కేజ్రీ సర్కారులో కీలక మంత్రిత్వ శాఖ బాధ్యతలు కూడా చేపట్టాడు. అయితే ఏకకాలంలో ఇద్దరు మహిళలతో సరసాలు ఆడి మంత్రి పదవిని చేజేతులా ఊడగొట్టుకున్నాడు. అయితే అతడు వెంటనే కొత్త రాగం అందుకున్నాడు. అదే ‘దళిత’ రాగం. ఈ విషయమంతా ఎవరి గురించో తెలుసుగా. ఇద్దరు మహిళలతో ఏకకాలంలో సరసాల్లో మునిగి అడ్డంగా బుక్కైన ఆప్ నేత, ఢిల్లీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సందీప్ కుమారే అతడని చెప్పక్కర్లేదేమో. నిన్న పదవి ఊడిపోయిన దరిమిలా... నేటి ఉదయం మీడియా ముందుకు వచ్చిన సందీప్ కుమార్ కొత్త వాదనను వినిపించారు. దళితుడినైనందుకే తనపై కుట్ర జరిగిందని, ఆ కుట్రకు తాను బలైపోయానని ఆయన వాపోయారు. అసలు తాను ఆ ‘నీలి’ సీడీలోనే లేనని కూడా ఆయన వాదించారు.

More Telugu News