: ‘జనతా గ్యారేజ్’ బెనిఫిట్ షోకు జక్కన్న!... థియేటర్ కు వెళ్లి సినిమా చూసిన టాలీవుడ్ దర్శకుడు!

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’ నేటి ఉదయం విశ్వవ్యాప్తంగా విడుదలైంది. టాలీవుడ్ హిట్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ జక్కన్నగా పేరుగాంచిన అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ‘జనతా గ్యారేజ్’ బెనిఫిట్ షోను వీక్షించారు. హైదరాబాదు శివారు కూకట్ పల్లిలోని శ్రీ భ్రమరాంభ మల్లికార్జున సినీప్లెక్స్ లోని థియేటర్ కు వెళ్లిన రాజమౌళి... తనకు ఇష్టమైన హీరో చిత్రాన్ని తిలకించారు. ప్రభాస్, రానా దగ్గుబాటిలతో తాను చిత్రీకరిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి-2‘ షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నప్పటికీ... జూనియర్ ఎన్టీఆర్ చిత్రం బెనిఫిట్ షోకు రాజమౌళి రావడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.

More Telugu News