: చంద్రబాబు ఆహ్వానిస్తేనే తిరిగి టీడీపీలో చేరా!: బోండా ఉమకు కౌంటర్ ఇచ్చిన టీజీ వెంకటేశ్
పవన్ కల్యాణ్పై మండిపడ్డ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ని ఉద్దేశిస్తూ ఇటీవలే టీడీపీ ఎమ్మెల్యే బోండ ఉమ పలు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, కడప జిల్లాలో బోండా ఉమపై టీజీ వెంకటేశ్ ఈ రోజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోండా ఉమ వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన అన్నారు. చంద్రబాబు ఆహ్వానిస్తేనే తాను తిరిగి టీడీపీలోకి చేరానని వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల్లోనూ గతంలో కాంగ్రెస్లో పనిచేసిన నేతలు ఉన్నారని టీజీ వెంకటేశ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆహ్వానిస్తే పార్టీకి లక్ష రూపాయల తొలిఫండ్ ఇచ్చింది తానే అని ఆయన అన్నారు. కొందరు ఫ్యాక్షన్ లీడర్ల వల్ల పార్టీ వీడాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.