: ఉద్యోగాల పేరిట మహిళలను వ్యభిచారంలోకి దింపిన వ్యక్తి అరెస్టు

ఉద్యోగాలిప్పిస్తానంటూ మహిళలకు మాయమాటలు చెప్పి వారిని వ్యభిచారంలోకి దింపిన వ్యక్తిని చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మోసాలకు పాల్పడుతున్న రఫీ అనే వ్యక్తిని సత్యవేడు దగ్గర పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు, తమిళనాడుకు చెందిన సుమారు 150 మంది యువతులను దుబాయ్, షార్జా, మలేషియాలోని వ్యభిచార గృహాలకు రఫీ తరలించాడు. ఇందుకు సంబంధించిన కార్యకలాపాలను చెన్నైనుంచి నిర్వహిస్తున్న రఫీ ముఠాలో 17 మంది సభ్యులు ఉన్నారు. ఈ ముఠా చేతిలో మోసపోయి విదేశాల్లో మగ్గుతున్న 150 మంది మహిళలను విడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని చిత్తూరు అడిషినల్ ఎస్పీ రత్న పేర్కొన్నారు.

More Telugu News