: బార్ గర్ల్స్ పై డబ్బులు విసరకండి: సుప్రీంకోర్టు ఆదేశాలు

బార్ గర్ల్స్ పై డబ్బులు విసరొద్దని, ఆ విధంగా చేయడం ద్వారా మహిళల గౌరవాన్ని కించపరిచినట్లవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో కోర్టు ఏకీభవించిందన్నారు. కాగా, బార్ల నిర్వహణపై మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన కఠిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముంబై రెస్టారెంట్స్ అసోసియేషన్ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. బార్లపై మరింత నిఘా, ఆల్కహాల్ పై నిషేధం, బార్లలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలంటూ ‘మహా’ సర్కార్ కొత్త చట్టం తీసుకువచ్చింది. దీనిని సవాల్ చేస్తూ బార్ల యజమానులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది.

More Telugu News