: ప్ర‌మాద‌మా.. ఆత్మ‌హ‌త్యా..?.. తుపాకి పేలి కెర‌మెరి ఎస్ఐ మృతి.. బాధ్యతలు స్వీకరించిన రెండు రోజులకే ఘటన

ఆదిలాబాద్‌లోని కెర‌మెరిలో విషాదం చోటుచేసుకుంది. తుపాకి పేలి ఆ ప్రాంత ఎస్ఐ కె.శ్రీ‌ధ‌ర్‌(27) మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న‌పై ప‌లు అనుమానాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. తుపాకి ప్ర‌మాద‌వశాత్తు పేలిందా? లేక శ్రీ‌ధ‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడా? అనే అంశం ఇంకా తేల‌లేదు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. రెండు రోజుల క్రిత‌మే శ్రీ‌ధ‌ర్ కెర‌మెరి ఎస్ఐగా బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. ఆయ‌న క‌రీంన‌గ‌ర్ జిల్లా సిరిసిల్ల ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. మూడు నెల‌ల నుంచి కెర‌మెరిలో ట్రైనీ ఎస్ఐగా ఆయ‌న ప‌నిచేస్తున్నాడు. ఎస్ఐగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన రెండు రోజుల‌కే ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

More Telugu News