: సోనియా చెప్పిన మాటను జగన్ వినుంటే సీమాంధ్రులకు ఇన్ని కష్టాలుండేవి కాదు: టీజీ వెంకటేష్ కీలక వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి వైకాపా నేత జగన్ తొందరపాటు నిర్ణయమే కారణమని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడటంతోనే రాష్ట్రం ముక్కలైందని అన్నారు. జగన్ సీఎం పదవి కావాలని అనుకున్నారని, అలా అనుకోకుండా, సోనియా గాంధీ చెప్పిన మాట వినుంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని అన్నారు. జగన్ బయటకు రావడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో విభజనకు కాంగ్రెస్ అంగీకరించిందని అన్నారు. సీమాంధ్ర ప్రజల కష్టాలకు జగన్ వైఖరే కారణమని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ దొంగలేనని గతంలో కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు అలంకరించి, ఇప్పుడు టీడీపీలో కొనసాగుతున్న టీజీ వ్యాఖ్యానించడం గమనార్హం.

More Telugu News