: ఆడబిడ్డలు దేశానికి పతకాలు సాధించారు!... సింధు, సాక్షిలపై ‘మన్ కీ బాత్’లో మోదీ ప్రశంసల జల్లు!

రియో ఒలింపిక్స్ లో భారత్ కు రెండు పతకాలు సాధించిపెట్టిన తెలుగు తేజం పీవీ సింధు, సాక్షి మాలిక్ ల ప్రతిభను ప్రధాని నరేంద్ర మోదీ ఆకాశానికెత్తేశారు. నేటి ఉదయం ఆలిండియా రేడియోలో నిర్వహించిన ‘మన్ కీ బాత్’లో క్రీడలను ప్రస్తావించిన మోదీ... సింధు, సాక్షిలతో పాటు దీపా కర్మాకర్, పుల్లెల గోపీచంద్ లను ప్రధానంగా ప్రస్తావించారు. ఆడబిడ్డలు దేశానికి ఒలింపిక్ పతకాలు సాధించిపెట్టారని వ్యాఖ్యానించిన మోదీ... సింధు, సాక్షిల సత్తాను ఆకాశానికెత్తేశారు. మరింత ప్రోత్సాహమిస్తే మరిన్ని అద్భుత విజయాలను వారు సాధిస్తారని చెప్పారు. ఇక ఒలింపిక్స్ లో పతకం సాధించలేకపోయినా దీపా కర్మాకర్ దేశ ప్రజల హృదయాలను గెలుచుకుందన్నారు. కోచ్ గా మెరుగైన క్రీడాకారులను తయారు చేస్తున్న బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్... దేశానికి ఒలింపిక్ పతాకాలు రాబట్టడంలో సఫలమయ్యారని మోదీ అన్నారు.

More Telugu News