: టాటాల బోర్డులో చేరిన టీవీఎస్ మోటార్స్, పిరామల్ గ్రూప్ చైర్మన్లు

టాటా గ్రూప్ కంపెనీల మాతృసంస్థ టాటా సన్స్ బోర్డు డైరెక్టర్లుగా పిరామల్ గ్రూప్ సంస్థల చైర్మన్ అజయ్ పిరామల్, టీవీఎస్ మోటార్స్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ లు చేరారు. వీరిద్దరి నియామకం గురువారం నుంచి అమల్లోకి వచ్చిందని, వీరు ఇకపై నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో కొనసాగుతారని టాటా సన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఇండియాలో బిలియనీర్లుగా పేరున్న అజయ్ పిరామల్, వేణు శ్రీనివాసన్ లకు వ్యాపారాలు నడపడంలో మంచి పేరున్నందున వీరి చేరిక టాటాలకు మేలు కలిగించేదేనని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇప్పటికే టాటా సన్స్ బోర్డులో టాటా సన్స్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఇషాత్ హుస్సేన్, రక్షణ శాఖ మాజీ కార్యదర్శి విజయ్ సింగ్, హార్వార్డ్ బిజినెస్ స్కూల్ డీన్ నితిన్ నోహ్రియా, అమెరికాలో భారత మాజీ రాయబారి రోనెన్ సేన్, ప్రపంచ వ్యూహకర్త ఫరీదా కంబట్టాలు కొనసాగుతుండగా, బోర్డుకు చైర్మన్ గా సైరస్ మిస్త్రీ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News