: ఢిల్లీకి చేరిన సాక్షి మాలిక్!... ఘనంగా స్వాగతం పలికిన హర్యానా మంత్రులు!

రియో ఒలింపిక్ప్ రెజ్లింగ్ విభాగంలో కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి చేరుకుంది. రియో ఒలింపిక్స్ లో భారత్ నుంచి భారీ సంఖ్యలో క్రీడాకారులు వెళ్లినా... తెలుగు తేజం పీవీ సింధుతో పాటు సాక్షి మాలిక్ మాత్రమే పతకాలు సాధించగలిగింది. ఇప్పటికే పీవీ సింధు వచ్చేయగా, కాస్తంత ఆలస్యంగా సాక్షి మాలిక్ రియో నుంచి వచ్చింది. నేటి ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న సాక్షికి ఆమె సొంత రాష్ట్రం హర్యానాకు చెందిన మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆమె హర్యానాలోని తన సొంతూరుకు బయలుదేరింది. ఇక స్వగ్రామంలోనే సాక్షి మాలిక్ ను ఘనంగా సన్మానించేందుకు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్వయంగా అక్కడికి వెళ్లనున్నారు. ఈ మేరకు సాక్షి స్వగ్రామంలో భారీ ఏర్పాట్లు జరిగాయి.

More Telugu News