: ఇంకా బాగా ఆడి పైకొస్తాను: పీవీ సింధు

ఇంకా బాగా ఆడి పైకొస్తానని రియో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ విజేత పీవీ సింధు పేర్కొంది. ఏపీ ప్రభుత్వం ఆహ్వానం మేరకు కృష్ణా పుష్కరాల ముగింపు కార్యక్రమంలో సింధు కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ, ‘క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. క్రీడాకారుల ఎదుగుదల కోసం ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు’ అని సింధు పేర్కొంది.

More Telugu News