: 85/3 మైలు దగ్గర సాగర్ కాలువ షట్టర్లను ఎత్తేసిన గుంటూరు రైతులు

గుంటూరు జిల్లా రైతులు సాగర్ కాలువ షట్టర్లను ఎత్తడంతో ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 85/3 మైలు దగ్గర సాగర్ కాలువ షట్టర్లను ఎత్తి గుంటూరు జిల్లాకు నీటిని మళ్లించారు. దీంతో, ప్రకాశం జిల్లా రైతులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా ఉండడానికి కాలువ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

More Telugu News