: ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు!... ఆసక్తి రేకెత్తిస్తున్న కోర్ కమిటీ భేటీ!

బీజేపీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాలకు ఏపీ, తెలంగాణకు చెందిన ఆ పార్టీ నేతలంతా ఢిల్లీ తరలివెళ్లారు. నిన్న రాత్రికే హస్తిన చేరుకున్న తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు నేడు జరగనున్న పార్టీ కోర్ కమిటీ భేటీలో ఏఏ అంశాలను ప్రస్తావించాలన్న విషయంపై చర్చోపచర్చలు జరిపారు. ఏపీలో కాస్తంత బలంగానే కనిపిస్తున్న పార్టీ... రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై వెనకడుగు వేసిన నేపథ్యంలో విషమ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించేలా జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏపీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో మరింత బలహీనంగా మారిన పార్టీకి పునరుజ్జీవం కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆ రాష్ట్రానికి చెందిన నేతలు పార్టీ జాతీయ నాయకత్వం నుంచి దిశానిర్దేశం కోరుతున్నారు. ఈ దిశగా జాతీయ నాయకత్వం నుంచి ఏ మేర సహకారం లభిస్తుందన్న విషయంపై ఆ రాష్ట్ర నేతలు ఆరా తీస్తున్నారు. పార్టీ జాతీయ నాయకత్వం కల్పించుకుంటే తప్పించి రాష్ట్రంలో పార్టీ బలోపేతం కాదని కూడా వారు నివేదించనున్నట్లు సమాచారం.

More Telugu News