: సైనా నెహ్వాల్ను కొనియాడిన పి.వి. సింధు
ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పి.వి. సింధు హైదరాబాద్ గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తన సీనియరయిన మరో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ను కొనియాడింది. దేశం కోసం సైనా నెహ్వాల్ ఎంతో కష్టపడిందని ఆమె వ్యాఖ్యానించింది. గతంలో సైనా నెహ్వాల్ ఎన్నో మెడల్స్ సాధించిందని గుర్తు చేసింది. భారత బ్యాడ్మింటన్ కు సైనా అందించిన సేవ ఎంతో గొప్పదని ఆమె ప్రశంసించింది. పుల్లెల గోపిచంద్ అకాడమీలో అన్ని వసతులు ఉన్నాయని ఆమె పేర్కొంది. గోపిచంద్ తనకు అత్యుత్తమ శిక్షణనందించారని తెలిపింది.