: బాంబు తయారుచేస్తుండగా పేలుడు.. బీజేపీ కార్యకర్త మృతి

బాంబు తయారుచేస్తుండగా అది కాస్తా పేలడంతో బీజేపీ కార్యకర్త ఒకరు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కూతుపరంబుకు చెందిన బీజేపీ కార్యకర్త దీక్షిత్ (27) ఇంటిలో నాటుబాంబును తయారుచేస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా పేలింది. దీంతో తీవ్రగాయాలపాలైన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు ధ్వంసమైనట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News