: ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ కు ప్రమోషన్...ఆర్బీఐ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ నియామకం

మరి కొన్ని వారాల్లో ఆర్బీఐ గవర్నర్ గా రఘురాం రాజన్ పదవీ కాలం ముగియనుండడంతో ఆర్బీఐకి కొత్త గవర్నర్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రఘురాం రాజన్ విధానాలను ముందుకు తీసుకెళ్లాల్సి ఉన్నందున కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీంతో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు ప్రమోషన్ ఇచ్చింది. ఆయనను ఆర్బీఐ గవర్నర్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో సెప్టెంబర్ 4న ఆయన ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

More Telugu News