: 40 బ్లేడులను తిన్న వ్యక్తి.. ఇలాంటి శస్త్ర చికిత్స ఎన్నడూ చేయ‌లేద‌ని డాక్టర్లే ఆశ్చర్యపోయిన వైనం!

ఆక‌లేస్తే మ‌న‌కి ఇష్టం వ‌చ్చిన ఆహార‌ప‌దార్థాలు వండుకొనో లేదా కొనుక్కొనో తింటాం. కానీ అమృత్‌స‌ర్‌లోని ఓ వ్య‌క్తి క‌ట్ట‌ర్ బ్లేడ్ల‌ను తిన్నాడ‌ట‌. ఆ బ్లేడ్ల‌ను తింటుంటే ఆహారం తింటున్న‌ట్లు త‌న‌కి అనిపించిందట‌. బ్లేడ్లు తిన్న‌ వ్య‌క్తికి ఇటీవ‌లే ఆపరేష‌న్ చేసిన వైద్యులు అత‌డి క‌డుపులోంచి సుమారు 40 బ్లేడుల‌ను బయటకు తీశారు. ఆప‌రేష‌న్ త‌రువాత ఆ వ్య‌క్తి ఆరోగ్యంగానే ఉన్నాడు. ఆ వ్య‌క్తి క‌డుపులోంచి బ్లేడుల‌ను బ‌య‌ట‌కు తీయ‌డానికి ఐదుగురు స‌భ్యుల వైద్యుల బృదం ఐదు గంట‌ల పాటు శ్ర‌మించింది. ఆప‌రేష‌న్ త‌రువాత తాను ఇప్ప‌టివ‌ర‌కు ఇలాంటి ఆపరేష‌న్ చేయ‌లేద‌ని డాక్ట‌ర్ జితేంద్ర మ‌ల్హోత్రా మీడియాకు తెలుపుతూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. రెండు నెల‌ల పాటు ఆ వ్య‌క్తి ఈ బ్లేడుల‌ను తిన్నట్లు స‌మాచారం.

More Telugu News