: పి.వి.సింధుకు భారీ నజరానా ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం

బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జ‌రుగుతున్న ఒలింపిక్స్‌లో అద్భుతంగా రాణించి భారత్ కు రజత పతకాన్ని తీసుకొచ్చిన బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధుకి ఢిల్లీ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. సింధుకి రెండు కోట్ల రూపాయల నజరానా అందించనున్నట్లు తెలిపింది. సింధుతో పాటు రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి కాంస్య పతకాన్ని సాధించిన హరియాణా వాసి, భారత రెజ్లర్‌ సాక్షి మలిక్‌కు కోటి రూపాయల న‌జ‌రానా ఇవ్వనున్నట్లు ఢిల్లీ ప్ర‌భుత్వం పేర్కొంది.

More Telugu News