: ఫైనలిస్ట్ మీద సింధుదే పైచేయి... ఇక స్వర్ణం మనదే: గోపీచంద్ అకాడమీ ఆటగాళ్ల ఆనందం

ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ లో భారత్ కు స్వర్ణపతకం వస్తుందని గోపీచంద్ అకాడమీ ఆటగాళ్లు పేర్కొంటున్నారు. ఫైనల్లో సింధుతో తలపడనున్న స్పెయిన్ క్రీడాకారిణి కెరలీనా మారన్ ను సింధు గతంలో ఒకసారి ఓడించిందని వారు పేర్కొంటున్నారు. ఆమెపై ఎలా ఆడాలో సింధుకు తెలుసని, గతంలో ఆమెపై ఆడిన, ఓడించిన అనుభవం సింధుకు ఉండడంతో బంగారుపతకం సాధిస్తుందని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆమెపై విజయాన్ని గత మూడు నెలల కాలంలోనే సింధు సాధించడంతో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. సింధు బంగారు పతకం సాధిస్తే...అది సింధుకో లేక గోపీచంద్ అకాడమీకో గర్వకారణం కాదని, యావద్భారత దేశానికి గర్వకారణమని, సింధు అలాంటి అవకాశం వదులుకోదని, రేపు స్వర్ణానికి గురిపెడుతుందని వారు తెలిపారు.

More Telugu News