: హఫీజ్ సయీద్ ఇస్లాంకు వ్యతిరేకంటూ యూపీలో ఫత్వా జారీ

భారత దేశానికి బుద్ధి చెప్పేందుకు కాశ్మీర్ కు పాకిస్థాన్ సైన్యాలను పంపాలన్న లష్కర్-ఏ-తోయిబా వ్యవస్థాపకుడు, ముంబై ఉగ్రవాదుల సూత్రధారి హఫీజ్ మహమ్మద్ సయీద్ పై ఒక ఫత్వా జారీ అయింది. తొలిసారిగా ఒక ఉగ్రవాదికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ లోని బరేలిలోని 'దర్గా ఎ అలా హజ్రత్' దర్గా ఈ ఫత్వా జారీ చేసింది. హఫీజ్ సయీమ్ ఇస్లాం వ్యతిరేకని, ఉగ్రవాద సిద్ధాంతాన్ని నూరిపోస్తున్నాడంటూ ఆ ఫత్వాలో పేర్కొన్నారు.

More Telugu News