: హాస్యనటుడు వేణుమాధవ్ తో పుష్కర స్నానం చేయించిన మంత్రి

ప్రముఖ సినీ హాస్య నటుడు వేణు మాధవ్ చేత ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి స్వయంగా ఈరోజు మధ్యాహ్నం పుష్కర స్నానం చేయించారు. విజయవాడలోని పున్నమి పుష్కర ఘాట్ లో పవిత్ర స్నానమాచరించిన అనంతరం వేణుమాధవ్ మీడియాతో మాట్లాడుతూ, నవ్యాంధ్రలో పుష్కర స్నానం చేయడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు. వేణుమాధవ్ తో పాటు ఆయన సన్నిహితులు కూడా ఉన్నారు.

More Telugu News