: పతకానికి అడుగు దూరంలో పీవీ సింధు!... నేటి సెమీస్ పోరుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ!

రియో ఒలింపిక్స్ లో కొడిగడుతున్న పతకాల అవకాశాలపై భారత్ కు కొత్త ఆశలు రేపిన తెలుగు తేజం పీవీ సింధు పతకానికి అడుగు దూరంలో నిలిచింది. భారత పతకాలపై ఆశలను సింధు సజీవంగా నిలపగా, నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ ఏకంగా పతకమే సాధించేసింది. ఇక నేడు మహిళల బ్యాడ్మింటన్ సెమీస్ బరిలోకి పీవీ సింధు దిగుతుంది. ఈ మ్యాచ్ లో సింధు నెగ్గితే... భారత్ ఖాతాలో మరో పతకం చేరిపోయినట్లే. ఇంతటి కీలక మ్యాచ్ లో సింధు విజయం సాధిస్తుందన్న ధీమాతో భారతీయులంతా నేటి రాత్రి టీవీలకు అతుక్కుపోనున్నారు. ఒలింపిక్స్ క్రీడల్లో కరణం మల్లేశ్వరి తర్వాత కీలక పోటీకి దిగుతున్న తెలుగమ్మాయి సింధునే కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ పోటీపై మరింత ఆసక్తి నెలకొంది.

More Telugu News