: నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం... లోయలో పడ్డ బస్సు...33 మంది మృతి

నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి కట్టికె దురాలి (అర్నికో హైవేపై) కి 85 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి 300 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. దీంతో ప్రయాణికుల్లో 33 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా, 43 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనపై సమాచారం అందగానే పోలీసులతో పాటు నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగింది. క్షతగాత్రులను హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించి, మట్టిదిబ్బల్లో కూరుకుపోయిన మృతదేహాలను వెలికి తీశారు. లోయలోకి బస్సు పల్టీలు కొడుతూ కింద పడగా, బస్సుతో నుంచి బయటకు పడిన ప్రయాణికులు కూడా పల్టీలు కొట్టారని, దీంతో పలువురు ఈ ప్రమాదంలో నుజ్జునుజ్జయ్యారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. దీనిపై నేపాల్ ప్రధాని ప్రచండ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

More Telugu News