: చంద్రబాబు ప్రైవేటీకరణ విధానాలే ఇప్పటికీ తెలంగాణలో కొనసాగుతున్నాయి: ప్రొ.కోదండరాం ఫైర్

తెలంగాణ ప్ర‌భుత్వంపై టీజేఏసీ ఛైర్మ‌న్ ప్రొ.కోదండ‌రాం మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ప‌ర్య‌టిస్తోన్న ఆయ‌న మందమర్రిలో జ‌రిగిన సీఐటీయూ రాష్ట్ర మహాసభల్లో పాల్గొని మాట్లాడారు. గోదావరి జలాలు అడుగంటిపోతున్నాయని, దీనికి ఓపెన్‌కాస్ట్‌ గనులే కార‌ణ‌మ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అవిభాజ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు నాయుడు చేసిన ప్రైవేటీకరణ విధానాలే ఇప్పటికీ తెలంగాణ‌లో కొనసాగుతున్నాయని అన్నారు. తెలంగాణ‌లో నీళ్లు, నిధులు, నియామకాలపై స‌ర్కారు నిర్ల‌క్ష్య వైఖ‌రిని క‌న‌బ‌రుస్తోందని పేర్కొన్నారు.

More Telugu News