: ఏపీకి ప్రత్యేకహోదా కోసం 13 రాష్ట్రాల సీఎంలను బాబు ఒప్పించాలి: పురందేశ్వరి

ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులను సీఎం చంద్రబాబు ఒప్పించాలని బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ చిత్తూరులోని గాంధీ సర్కిల్ లో ధర్నా జరిగింది. జర్నలిస్టుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డు నుంచి రూ.4 వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. ఏపీలో వెనుక బడిన జిల్లాల కోసం కేంద్రం ఇచ్చిన నిధుల ఖర్చు నివేదికను మన రాష్ట్రం కేంద్రానికి ఇవ్వాల్సి ఉందని పురందేశ్వరి చెప్పారు.

More Telugu News