: 'జనతా గ్యారేజ్' ఆడియో వేడుకను మిస్సవుతున్న సమంత

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ ఆడియో వేడుక కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది. తమ అభిమాన హీరో, హీరోయిన్ల కోసం ఎదురు చూసే అభిమానులతో శిల్పకళావేదికలోని ఆడిటోరియం నిండిపోయింది. అయితే, ఈ కార్యక్రమానికి దక్షిణాది బ్యూటీ సమంత హాజరు కావట్లేదు. ఈ విషయాన్ని స్వయంగా సమంతే తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. తనకు ఒంట్లో నలతగా ఉన్న కారణంగా ఈ ఆడియో వేడుక కార్యక్రమానికి హాజరు కావట్లేదని తన ట్వీట్ లో పేర్కొంది.

More Telugu News