: జూరాల గేట్లు మూత... ఆగిన వరద

ఎగువ నుంచి వస్తున్న వరదనీరు ఆగిపోవడంతో జూరాల ప్రాజెక్టులో గేట్లన్నింటినీ మూసివేశారు. దీంతో దిగువకు నీటి ప్రవాహం ఆగిపోయింది. ఫలితంగా జూరాల దిగువన పలు కృష్ణా పరీవాహక మండలాల్లో పుష్కర స్నానాలు చేస్తున్న వారి కళ్ల ముందే నీటి ప్రవాహం తగ్గుతూ వెళ్లిపోయింది. జూరాల, నందిమల, మూలమల మండలాలను ఆనుకుని ప్రవహిస్తున్న నదిలో ప్రస్తుతం నీరు లేదు. పుష్కర ఘాట్లు నిరుపయోగంగా మారగా, భక్తులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. సమీపంలోని పొలాలు, బోరు బావుల వద్ద స్నానాలు చేసి వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

More Telugu News