: ఓ కానిస్టేబుల్ జీవితం విషాదాంతం... పుష్కర విధులకు వచ్చి అనంతలోకాలకు!

పవిత్ర కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతున్న వేళ బందోబస్తు నిమిత్తం తిరుపతి నుంచి వచ్చిన కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఏపీ పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వెంకట్రావు, పుష్కర విధుల నిమిత్తం గూడవల్లి ప్రాంతానికి వచ్చారు. విధి నిర్వహణలో భాగంగా రోడ్డు దాటుతున్న వేళ, ఓ ఇన్నోవా కారు వచ్చి అతన్ని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో రోడ్డు డివైడరుకు వెంకట్రావు తల తగలడంతో, ఆయన అక్కడికక్కడే మరణించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, దర్యాఫ్తు ప్రారంభించారు. కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆదుకుంటామని అధికారులు తెలిపారు.

More Telugu News