: తెలుగు రాష్ట్రాల్లో పుష్కర శోభ!... నేటి నుంచి 12 రోజుల పాటు కృష్ణా పుష్కరాలు!

తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల్లో కృష్ణా పుష్కరాల శోభ సంతరించుకుంది. నేటి తెల్లవారుజామున కృష్ణా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి వరుసగా 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. ఈ మేరకు కృష్ణా పరీవాహక ప్రాంతం ఉన్న అన్ని జిల్లాల్లో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు భారీ ఏర్పాట్లు చేశాయి. మునుపెన్నడూ లేని రీతిలో రవాణా సౌకర్యాలతో పాటు భద్రతను పెంచారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏ చిన్న ప్రమాదం కూడా జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిన్న రాత్రికే లక్షలాది మంది భక్తులు ఆయా ఘాట్ల వద్దకు చేరుకుని పుష్కరాలు ప్రారంభం కాగానే కృష్ణా నదిలో పుష్కర స్నానం చేశారు.

More Telugu News