: ఎల్లలు దాటిన గ్యాంగ్ స్టర్ నెట్ వర్క్!... గోవాలో నయీమ్ అనుచరుడి అరెస్ట్!

భూ దందాలు, సెటిల్ మెంట్లు, ప్రముఖులకు బెదిరింపులతో తెలంగాణ పోలీసులకు పెను సవాల్ గా నిలిచి ఖాకీల బుల్లెట్లకు హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ నేర సామ్రాజ్యం ఎల్లలు దాటిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, చత్తీస్ గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన ఐపీఎస్ అధికారులతో స్నేహం నెరపిన నయీమ్ ముంబై, బెంగళూరు తదితర నగరాల్లోనూ ఆస్తులు కూడబెట్టాడు. తాజాగా మొన్న పాలమూరు జిల్లా షాద్ నగర్ లో అతడు హతం కాగా... అతడి అనుచరుల కోసం తెలంగాణ పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో నయీమ్ ముఖ్య అనుచరుడిగా పేరున్న మహ్మద్ ఖాజుద్దీన్ ను పోలీసులు గోవాలో నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిని నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు పోలీసులు చర్యలు చేేపట్టారు.

More Telugu News