: బిల్లు చెల్లింపుల్లో అవినీతికి పాల్పడితే జైలు తప్పదు: సీఎం చంద్రబాబు

గృహణ నిర్మాణ శాఖకు సంబంధించిన కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు తమ తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. గృహ నిర్మాణ శాఖపై ఈరోజు సీఎం నివాసంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, బిల్లు చెల్లింపుల్లో అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. గృహ నిర్మాణ శాఖను అన్ని విధాలుగా బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు.

More Telugu News