: తిరుపతి అర్బన్ తహశీల్దార్ పై అట్రాసిటీ కేసు నమోదు

తిరుపతి అర్బన్ తహశీల్దార్ వెంకటేశ్వర్లుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అలిపిరి ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఏడాది మార్చి 18వ తేదీన అర్బన్ తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎస్సీ, ఎస్టీలకు ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం భూములను కేటాయించాలంటూ తిరుపతి ఆటోనగర్ లో నివాసముంటున్న శ్రీరాములు ఆందోళన చేపట్టారు. అదేసమయంలో అక్కడున్న తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఆందోళన చేస్తున్న తనను కులం పేరుతో దూషించారంటూ డీజీపీ జేవీ రాముడికి శ్రీరాములు ఫిర్యాదు చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు తహశీల్దార్ పై గత ఆదివారం నాడు అట్రాసిటీ కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. అయితే, ఈ సంఘటన జరిగింది ముత్యాలరెడ్డి పల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో అని, ఈ కేసును ఎమ్మార్ పల్లి స్టేషన్ కు బదిలీ చేస్తామని తెలిపారు.

More Telugu News