: 8 మంది పురుషుల్లో ఒక్కరికి, 9 మంది మహిళల్లో ఒక్కరికి కేన్సర్ ముప్పు

భార‌తీయులు అధిక సంఖ్య‌లో కేన్స‌ర్ బారిన ప‌డుతున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్‌ దేశంలో కేన్సర్ బారిన పడుతున్న వారిపై రాజ్యసభలో తాజాగా ప్రకటన చేశారు. 2012 నుంచి 2014 మధ్య వరకు కేన్సర్ బారిన పడిన వారి గురించి తమకు భారత వైద్య మండలి ఇచ్చిన నివేదిక ప్రకారం ఆమె పలు విషయాలు వెల్లడించారు. దేశంలో ప్రతి ఎనిమిది మంది పురుషుల్లో ఒకరికి, ప్రతి తొమ్మిది మంది మహిళల్లో ఒక్కరికి కేన్సర్ ముప్పు పొంచి ఉంద‌ని ఆమె పేర్కొన్నారు.

More Telugu News