: కోస్తాకు వ‌ర్షసూచ‌న‌.. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చ‌రిక‌

రాగల 24 గంటల్లో కోస్తాలోని ప‌లు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం పేర్కొంది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ బెంగాల్లో తీరాన్ని అనుకుని ఉందని, అది మరింత బలపడే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. వాయుగుండం ఒడిశావైపు పయనించే అవ‌కాశం ఉందని, ఛత్తీస్గడ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని పేర్కొంది. దీని ప్ర‌భావంతోనే కోస్తాలో వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని తెలిపింది. తీరం వెంబడి 45 -50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉందని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

More Telugu News