: మ్యాచ్ ప్రారంభంలోనే శిఖర్ ధావన్(1), కోహ్లీ(3) ఔట్
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా ఆతిథ్య దేశంతో డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియంలో మూడో టెస్ట్ మ్యాచులో పోరాడుతోంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ టీమిండియా కీలక వికెట్లను పడగొట్టింది. ఓపెనర్ శిఖర్ ధావన్ కేవలం ఒక్కపరుగు చేసి వెనుదిరిగాడు. జట్టు స్కోరు 9 పరుగుల వద్ద గాబ్రియెల్ బౌలింగ్లో శిఖర్ ధావన్ ఔటయ్యాడు. 19 పరుగుల వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లీ(3 పరుగులు) కూడా జోసెఫ్ ఓవర్లో ఔటయ్యాడు. ఇరువురూ క్యాచవుటే అయ్యారు. ప్రస్తుతం రహానె, రాహుల్ క్రీజులో ఉన్నారు.