: మాల్యాకు మరో ఎదురు దెబ్బ!... రూ.6 వేల కోట్ల ఆస్తుల జప్తునకు ఈడీ సన్నాహాలు!

బ్యాంకులకు రూ.9 వేల కోట్లకు పైగా రుణాలను ఎగవేసి ఎంచక్కా లండన్ పారిపోయిన విజయ్ మాల్యాకు భారీ ఎదురు దెబ్బ తప్పేలా లేదు. ఇప్పటికే ఈ కేసుపై ముమ్మర దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)... కోర్టు ముందు హాజరుకావడానికి మాల్యా నిరాకరిస్తుండటంతో కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతోంది. మాల్యా, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న రూ.6 వేల కోట్లకు పైగా స్థిర, చరాస్తులను జప్తు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు సదరు ఆస్తుల వివరాలను రాబట్టేందుకు ఈడీ పలు ఆర్థిక సంస్థలు, బ్యాంకులకు లేఖలు రాసింది. ఈడీ జప్తు చేయనున్న మాల్యా ఆస్తుల్లో... ఆయన పేరిట ఉన్న షేర్లు, ఆయన, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న పలు స్థిర, చరాస్తులున్నట్లు విశ్వసనీయ సమాచారం.

More Telugu News