: కుక్కపై యాసిడ్ పోసి రాక్షసానందం పొందిన వ్యక్తి.. కేసు నమోదు

మూగజీవులయిన కుక్కలను కిరాత‌కంగా హింసిస్తోన్న సంఘ‌ట‌న‌లు ఏ మాత్రం తగ్గ‌డం లేదు. ఇటీవ‌ల వ‌ర‌స‌గా కుక్క‌ల‌ను హింసించిన ఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మూగ‌జీవాల‌ను హింసిస్తూ చంపేస్తోన్న వారిపై పోలీసులు కేసులు పెడుతున్నా అటువంటి ఘ‌ట‌న‌లు ఎక్కడో ఒక చోట జరుగుతూనే వున్నాయి. శున‌కాల‌ను దారుణంగా హింసిస్తూ రాక్ష‌సానందం పొందుతున్నారు. తాజాగా అహ్మదాబాద్‌లోని చంద్‌ఖేడాలో ఇటువంటి చ‌ర్యే మ‌రొక‌టి జ‌రిగింది. కేతన్ పటేల్ అనే ఓ వ్య‌క్తి వీధికుక్కపై యాసిడ్ పోసి రాక్ష‌సానందాన్ని పొందాడు. అనంత‌రం ఆ కుక్క‌ని ఆసుప‌త్రికి త‌ర‌లించినా దాని ప్రాణాలు నిల‌వ‌లేదు. దీంతో ఆ దుండగుడిపై స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో కేసు నమోదయింది.

More Telugu News